Monday, April 29, 2024

ముగ్గుల అర్థం పరమార్థం

మన పూర్వీకులు ముగ్గు ఎందుకు పెట్టేవారు? ఇంటి ముందు అందంగా తీర్చిదిద్దే ముగ్గులలో దాగివున్న అర్థం, పరమార్థం ఏంటి? అనేది తెలుసుకోవడం ప్రతి ఒక్కరి ధర్మం.
ఇంటి గడప ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డ గీతలు ఇంటి లోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి. ముగ్గువేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈవిధంగా ఖచ్చితంగా వేయాలి.
ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతే కాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలీని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర, తంత్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరిచేరనీయవు. అం దుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు. తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధాన చేయాలి. యజ్ఞ, యాగాదులలో యజ్ఞ గుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్య లలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టు- ప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి. దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్‌, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవారు, శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆమెకి ఏడు జన్మలవరకు వైధవ్యం రాదని, మరియు సుమంగళిగానే మరణిస్తుందని దేవీ భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి. పండుగ వచ్చింది కదా అని, నడవ డానికి చోటు- లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూ డదు.ఇప్పుటి రోజులలో ముగ్గులు రోజు వేయలేక పెయింట్‌ పెట్టేస్తున్నారు. దాన్ని ముగ్గుగా అంగీకరించదు. ఏరోజు కారోజు బియ్యపు పిండి తో ముగ్గు పెట్టాలి. నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర దీపా రాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్‌ దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు శుభసూచకాలుగా పని చేస్తాయి. పూర్వం రోజూలలో సాధువులు, సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగే వారు. ఏ ఇంటిముందైనా ముగ్గులేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు భిక్షకూలు కూడా ముగ్గులేని ఇళ్ళకు వెళ్ళి అడ్డు క్కునే వారు కాదు. ఇంటిముందు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గువేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు. ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణా లు దాగి ఉన్నాయి. మనం ఆచరించే ఏ ఆచారమూ మూఢ నమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయా లన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలు, విలువలతో కూడినవి.
– డా. చదలవాడ హరిబాబు
9849500354

Advertisement

తాజా వార్తలు

Advertisement