Saturday, May 4, 2024

క్షీరాబ్ది ద్వాదశి వ్రతం

కార్తీకంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్లపక్ష ద్వాదశి. హరి బోధినీ ద్వాదశి అనీ, యోగీశ్వర ద్వాదశి అని, చిలుకు ద్వాదశి, కైశిక ద్వాదశి అనీ అంటారు. ఎల్లప్పుడూ క్షీర సాగరంలో దర్శనం ఇచ్చే శ్రీమన్నారాయణుడు ఈ ద్వాదశి రోజు శ్రీమహాలక్ష్మీతో కూడి బృందావనానికి వచ్చి తన ప్రియ భక్తులకు దర్శనమిస్తాడట. కావున ఈ ద్వాదశిని బృందావన ద్వాదశి అని కూడా అంటారు. బృందావనం అంటే మన ఇంట్లో వుండే తులసి దగ్గరకు వస్తారు. ఈరోజు బృందావనం లో శ్రీమహావిష్ణువును అర్చించినవారికి సకల శుభాలు కలుగు తాయని పెద్దలు చెప్తారు. మనం ఎప్పుడు దేవుని దగ్గర దీపం వెలిగించినా వెలిగించకపోయిన ఒక్క క్షీరాబ్ధి ద్వాదశి రోజు దేవుని దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపం వెలిగిం చినంత పుణ్యం వస్తుందని అంటారు. దూర్వాస మహర్షి వారి చేత శపించబడి వారి సిరిసంప దలను, సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజోవిహనుడైన ఇంద్రు డు, తదితర దేవతలు తాము కోల్పోయిన వైభవాన్ని, తేజస్సు ను తిరిగి పొందడానికి శ్రీమహావిష్ణువు ఆలోచనతో రాక్షసు లతో కలిసి క్షీరసాగరాన్ని మధనం ప్రారంభించారు. అలా క్షీర సముద్రాన్ని మధించిన రోజు కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశి అనీ, ఆషాఢశుద్ధ ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ#హ రి నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశినాడు నిద్ర నుండి మేల్కాంచి తొలిసారిగా మునులకు, దేవతలకు క్షీరసా గరం నుండి దర్శినమిచ్చినది ఈ ద్వాదశినాడే కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడుతున్నదని అనేక పురాణాలు చెప్తున్నాయి. అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్న ప్పుడు కొన్ని చినుకు చుక్కలు మునుల మీద, దేవతల మీద చిలకరించబడ్డాయట. అందుకే ‘చిలుకు ద్వాదశి’ అని కూడా పిలుస్తారు.క్షీరసాగర మధనంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని విష్ణువు వివాహమాడిన రోజు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే. అందుకే పవిత్రమయిన ఈరోజు వీరి కల్యాణం జరిపించడం సర్వశుభప్రదమన్న భావనతో విష్ణుస్వరూపమైన ఉసిరి కొమ్మకు, లక్ష్మీస్వరూపమైన తులసికి వివాహం చేస్తారు. ఈరోజే మోహనీ అవతారంతో శ్రీమహావిష్ణువు అమృతం దేవతలకు పంచి ఇచ్చాడట. అందుకనే ఈరోజు విష్ణాలయా ల్లో స్వామిని మోహినీరూపంతో అలంకరిస్తారు. సుగంధ ద్రవ్యాలు కలిపిన క్షీరాన్ని అమృత భావనతో భక్తులకు స్వామి ప్రసాదంగా పంచుతారు.
మన పురాణ ఇతిహాసాలలో తులసికున్న ప్రాముఖ్యత, ప్రాధాన్యం వెలకట్టలేనిది. ‘తులసి’ని సాక్షాత్తు శ్రీమన్నారాయ ణుడి స్వరూపంగా, లక్ష్మీసమేతంగా మన పురాణాలు చెబుతు న్నాయి. అందువల్లే తులసిని పూజించినవారి ఇంట ధనధా న్యాదులకు ఎలాంటి లోటు ఉండదని, వారి ఇంట సిరులు పండుతాయని నమ్ముతారు. తులసి పూజవల్ల అపారమైన పుణ్యఫలాలు సంప్రాప్తిస్తాయి. సత్యాదేవి తులాభారమున రుక్మిణీదేవి తులసీదళము నుంచి తూచి కృష్ణుణ్ణి తన వాడు గా చేసుకొంది. దీనితో కృష్ణుడికి తులసి అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. గోదాదేవి తులసి దండలను శ్రీరంగనాధుని కర్పించి అతనికిష్టురాలై శ్రీరంగనాధుని సాన్నిధ్యం పొంది ంది. వనవాసంలో కూడా సీతాదేవి తులసిని పూజించింది. తులసి వృత్తాంతం, తులసి ప్రశంస, మన పురాణాలలో అనేక చోట్ల ప్రస్తావించి ఉంది. తులసి జన్మవృత్తాంతం తెలిపే పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది.
పురాణగాథ
తులసి మధురానగరంలో గొప్ప కన్య. శ్రీకృష్ణుని అను రాగాన్ని అపారంగా పొందింది. తులసి, శ్రీకృష్ణుల అనురా గాన్ని ఓర్వలేని రాధ శాపానికి గురై భూలోకాన మాధవీ, ధర్మధ్వజులను రాజదంపతులకు జన్మించింది. ఆ రాజ దంప తులు ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచుకుంటుండగా, ఆమెకు యుక్తవయస్సు వచ్చింది. ఆమె రంభ, ఊర్వశి, మేనక ల అందాన్నే తలదన్నిన అందకత్తెగా ఆమె పేరు గాంచింది. అలాగే ఆమె గుణ రూపాదులలో తుల లేకపోవడం వల్ల ఆమెకు ‘తులసి’ అని పేరొచ్చింది. బ్రహ్మకోసం తపస్సు చేసి, విష్ణు సాంగత్యాన్ని వరంగా పొందింది.
ఇదిఇలా వుండగా శ్రీకృష్ణుని అంశ గల సుధాముడు శంఖచూడుడను రాక్షసుడిగా జన్మించాడు. బ్రహ్మనుంచి మరణం లేకుండా వరం పొందాడు. అయితే అతని భార్య పతి వ్రతగా ఉన్నంతవరకూ శంకచూడుడికి మరణం సంభ వించదని వరమిచ్చాడు. ఒకసారి శంఖచూడుడు తులసి అందానికి పరవశుడై, ఆమెను మోహించి వివాహమాడాడు. తులసిని వివా#హం చేసుకున్న శంఖచూడుడు ఆమె ప్రాతి వ్రత్య ప్రభావంతో, దేవతలను, మునులను మట్టుబెట్టినా, ఎవరూ ఏమీచేయలేకపోయేవారు. దాంతో శ్రీహరి దేవతలు, మునుల అభీష్టం మేరకు ఓసారి శంఖచూడుడి రూపంలో తులసి దగ్గరికి వెళ్ళాడు. వచ్చింది తన భర్తేననుకుని తులసి శంఖచూడుడి రూపంలో ఉన్న విష్ణువుతో క్రీడించింది. అనం తరం అతను తన భర్తకాదని తెలుసుకుని రాయిని కమ్మనమని శపించింది. శ్రీహరి జరిగిన విషయాన్ని చెప్పగా పశ్చాత్తాప పడింది. శ్రీహరి ఆమెని అనుగ్రహించాడు. ఆమె అప్పటి నుం చి లక్ష్మీదేవితో సమానంగా పూజింపబడుతుందని, ఆమె శరీ రం గండకీ నదియై ప్రవహించి పుణ్యప్రదమవుతుందని వర మిచ్చాడు. అలాగే ఆమె కేశము తులసిగా జన్మిస్తుందని, తుల సి దళాలు, తులసి విష్ణుప్రీతికరాలవుతాయని వర మిచ్చాడు. అలాగే ఆమె శాపాన్ననుసరించి శిలనై సాలగ్రామ రూపా న ఉన్న తాను లక్ష్మీనారాయణాది రూపాలలో ఉంటానని, తులసిని శంఖము, సాలగ్రామమును కూర్చి పూజిస్తే సర్వ శ్రేయాలు కలుగుతాయని వరమిచ్చాడు. ఆనాటి నుంచి తులసి లక్ష్మీస్వరూపంగా పూజింపబడుతోంది.
తులసి పూజ తులసికోట (బృందావనం) ముందు అయిదు పద్మాలు వేసి వాటిమీద దీపాలుంచి లక్ష్మీనారాయణస్వామిని పూజిం చాలి. అయిదు రకాల భక్ష్యాలను, ఫలాలను నివేదించి అయిదు తాంబూలాలను సమర్పించాలి. ప్రదక్షిణ నమస్కా రాలతో కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ పూజించాలి. కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం పూజ మొదలైనవి చేసి, తులసీ దేవిని, లక్ష్మీనారాయణులను అర్చించాలి. నాటి రాత్రి జాగ రణ చేయాలి. ద్వాదశినాడు దేవదేవుడు లక్ష్మీసమేతుడై, ము క్కోటి దేవతలతో కలిసి బృందావనానికి (తులసికోట) వస్తాడు. కాబట్టి తులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణుడుని పూజిం చాలి. మానెడు బియ్యపు పిండితో మూడు చలిమిడి ముద్దలు చేయాలి. వాటిని నివేదించి తులసివద్ద ఒక దాని నుంచాలి. రెండవ దానిని బ్రాహ్మణునికీయాలి. మూడవ దానిని రోటిలోనుంచి పాలు పోసి చెరకు గడలతో దంచాలి. అలా చేయడంవల్ల విశేషమైన పుణ్యఫలాలు లభించి, మోక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మాంగళ్య వృద్ధి, పుత్రపౌత్రులు, సర్వసౌఖ్యాలు కలుగుతాయని, పూర్వజన్మ పాపాలు కూడా నివారింపబడతాయని అవి చెబుతున్నాయి. తులసి మహత్యం గురించి నారదుడు చెప్పగా, శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని ఆచరించాడట. అందువల్ల ఇంతటి మహిమాన్విత తులసి పూజ సర్వజనులకు శ్రేయోదాయకమైన పూజగా కొనియాడబడుతోంది.

శ్రీ తులసీ స్త్రోత్రమ్‌

జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే
యతో బ్రహ్మాదయో దేవా: సృష్టి స్థిత్యంత కారిణీ
నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే
నమో మోక్షప్రదే దేవి నమ సంపత్ప్రదాయికే

తులసీ శ్రీ మహాలక్ష్మీర్విద్యా యశస్వినీ
ధర్మా ధర్మా నవా దేవీ దేవ దేవ: మన:ప్రియా
లక్ష్మీప్రియసఖీ దేవీద్యౌర్భమిరచలాచలా
షోడశైతాని నామాని తులస్యా: కీర్తెయేన్నర:

లభతే సుతరాం భక్తిమంతే విష్ణుపదం భవేత్‌
తులసీ భూర్మహాలక్ష్మీ: పద్మినీ శ్రీర్హరిప్రియా
తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
నమస్తే నారదనుతే నారాయణ
మన:ప్రియే

- Advertisement -

– డా.చదలవాడ హరిబాబు
9849500354

Advertisement

తాజా వార్తలు

Advertisement