Sunday, May 5, 2024

అప్పన్న ఆలయంలో క్షీరాబ్ది ద్వాదశి వేడుకలు

విశాఖపట్నం, ప్రభ న్యూస్‌ బ్యూరో: సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో మంగళవారం క్షీరాబ్ధి ద్వాదశి(చిలుక ద్వాదశి ) వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా సింహాద్రినాధుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఆలయ ఆస్థాన మండపంలో అదిష్టింపజేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం రోలులో తెల్ల నువ్వులు, బెల్లం, కొత్త చెరుకు గడలతో చిమ్మిడి అమృతంలా తయారు చేశారు. ఆయా పదార్ధాలను రోకళ్లతో దంచి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement