Friday, May 3, 2024

నువ్వు నా జీవితంలోకి వచ్చి ఏడాది.. విఘ్నేశ్ శివ‌న్

నువ్వు నా జీవితంలోకి వ‌చ్చి ఏడాది అయింద‌ని స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార భ‌ర్త‌..డైరెక్ట‌ర్ విఘ్నేశ్ శివ‌న్ ట్వీట్ చేశాడు. కాగా నేడు నయనతార‌-విఘ్నేశ్‌ మొదటి వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా విఘ్నేశ్‌ శివన్‌ సోషల్‌ మీడియా ద్వారా భార్యకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. నువ్వు నా జీవితంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. ఈ ఏడాది ఎన్నో క్షణాలతో నిండిపోయింది. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాం. అనేక ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇంటికి తిరిగొచ్చి నా అందమైన ఫ్యామిలీని చూస్తే.. కోల్పోయిన ఎనర్జీ మొత్తం తిరిగి వస్తుంది. ఫ్యామిలీ ద్వారా వచ్చే కాన్ఫిడెన్స్ వేరే స్థాయిలో ఉంటుంది. కలలు సాకారం చేసుకునే శక్తినిస్తుంది. మన పిల్లలు ఉయిర్‌, ఉలగమ్‌లకు మంచి జీవితాన్ని అందించేందుకు ప్రయత్నిస్తాను’ అంటూ పోస్ట్‌ పెట్టారు. దీంతోపాటు నయన్‌ తన ఇద్దరి పిల్లల్ని ఎత్తుకుని ఉన్న క్యూట్‌ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్ట్‌, ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ పెద్దల అంగీకారంతో గతేడాది జూన్‌ 9వ తేదీన వివాహబంధంతో ఒక్కట‌యిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement