Saturday, April 27, 2024

సినీ కార్మికులను ఆదుకుంటాం…మంత్రి తలసాని

కరోనా కారణంగా సినీ పరిశ్రమలో వేలాదిమంది కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం కొంతమంది ఇండస్ట్రీ ప్రతినిధులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ వినతి పత్రాన్ని అందజేశారు. అయితే సానుకూలంగా స్పందించిన తలసాని ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని ప్రతి కార్మికుడికి వాక్సిన్ అందేలా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

కరోనా ను నియంత్రించడం కోసం లాక్ డౌన్ అమలు చేస్తున్నామని దీన్ని అందరూ అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలని భౌతిక దూరం పాటించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement