Saturday, May 4, 2024

విరాటపర్వం రిలీజ్ ఓటీటీ లో ఉండదు

వేణు ఊడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా ప్రేక్షకుల ముందుకురాబోతున్న చిత్రం విరాటపర్వం. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రియమణి ఓ కీలక పాత్రలో నటించింది. ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే రోజు రోజుకి కరోనా ప్రభావం ఎక్కువ అవుతుండటంతో ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. సినిమాహాల్స్ కూడా ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో నిర్మాతలు ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిలో నిజం లేదని తేలింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ డిజిటల్ హిందీ డబ్బింగ్ శాటిలైట్ హక్కులు అమ్ముడు పోయాయట. థియేట్రికల్ హక్కులను డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇచ్చారట. కాబట్టి ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ సినిమా కు సంబంధించి విడుదలైన టీజర్ ఆకట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement