Thursday, May 2, 2024

రీ రిలీజ్ కానున్న‌.. సీనియ‌ర్ ఎన్టీఆర్ అడ‌విరాముడు

స్టార్ హీరోల కెరీర్ మలుపు తిప్పిన సినిమాలు థియేటర్లో మరోసారి రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు కూడా తమ అభిమాన హీరోలు నటించిన మంచి బ్లాక్ బస్టర్ సినిమాలను మరోసారి థియేటర్లో చూడటానికి ఇష్టపడుతున్నారు. సీనియ‌ర్ న‌టుడు ఎన్టీఆర్.. ‘అడవి రాముడు’ సినిమాను 4కే వెర్షన్​లో రీ రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్ శ‌త జ‌యంతి సంద‌ర్భంగా ఆయన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘అడ‌వి రాముడు’ను రీ రిలీజ్ చేయనున్నారు. మే 28న తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవ‌ర్‌సీస్‌లోనూ ఈ సినిమా స్పెష‌ల్ ప్రీమియ‌ర్స్ స్క్రీనింగ్ వేయనున్నారు.

ఈ సినిమా ప్రింట్స్‌ను రీ మాస్ట‌రింగ్ చేసి 4కే రిసొల్యూషన్​తో విడుదల చేయనుండటం విశేషం. ఈ చిత్రం ద్వారా వ‌చ్చే క‌లెక్ష‌న్స్‌ను సేవా కార్య‌క్ర‌మాల కోసం వినియోగిస్తారని సమాచారం.1977లో సీనియర్ ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన సినిమా ‘అడవి రాముడు’. ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఇందులో జయప్రద, జయసుధ హీరోయిన్ లుగా నటించారు. ఇక ఈ సినిమాకు బాలసుబ్రమణ్యం నేపథ్య గానం అందించగా మహదేవన్ సంగీతం అందించారు. అప్పట్లో ఈ సినిమాను సత్య చిత్రం నిర్మాణ సంస్థ నిర్మించింది. ఈ సినిమాను అప్పటి ప్రేక్షకులు చూసి ఓ రేంజ్ లో ఫిదా అయ్యారని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement