Friday, April 26, 2024

గోపీచంద్ డబల్ ట్రీట్…. సీటిమార్ వెనక్కి ?

కరోనా మహమ్మారి కారణంగా చాలా సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నాయి. అలాగే షూటింగ్ లని సైతం నిలిపివేశాయి. అనుకున్న షెడ్యూల్స్ అన్నీ కూడా తారుమారయ్యాయి. ఇదిలా ఉండగా టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రస్తుతం సిటిమార్, పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు. మొదట ఏప్రిల్ 2న విడుదల చేయాలని ప్లాన్ చేసారు. కానీ కరోనా కారణంగా కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేస్తే దీంతో పాటు పోటీ పడే సినిమాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

మరోవైపు పక్కా కమర్షియల్ సినిమా షూటింగ్ ను కూడా త్వరలో కంప్లీట్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. అలాగే ఈ సినిమా రిలీజ్ కి దగ్గరలోనే సిటిమార్ సినిమాను కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక నిజమైతే గోపీచంద్ వరుస సినిమాలతో అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతున్నట్లే.

Advertisement

తాజా వార్తలు

Advertisement