Saturday, May 4, 2024

స్టువర్టుపురం దొంగ…అఫీషియల్

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్ళు అవుతున్నా సరైన హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అయితే అనుకున్న స్థాయిలో ఒక్క సినిమా కూడా ఆకట్టుకోలేక పోతోంది. ఇప్పుడు చత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇదిలా ఉండగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఓకే చెప్పాడు బెల్లంకొండ. 1970 కాలం నాటి టైగర్ నాగేశ్వర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న సినిమాలో బెల్లం కొండ శ్రీనివాస్ నటించబోతున్నాడు.

ఈ సినిమాకి స్టువర్ట్ పురం దొంగ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కేఎస్ దర్శకత్వం వహిస్తుండగా… మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. మరి బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement