Friday, April 26, 2024

‘ఖిలాడి’ ని ఖతం చేసేందుకు దుబాయ్ వెళ్తున్న రవితేజ!!

క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం అదే జోష్ తో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అసలు విషయానికొస్తే రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

అలాగే సీనియర్ నటుడు అర్జున్ నటి అనసూయ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మిగతా 10 శాతం షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది. అయితే మొదట ఓ చిన్న షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారట. అది పూర్తయిన తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ దుబాయ్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో షూటింగ్ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ అవుతుందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement