Sunday, April 28, 2024

కరోనా తో తమిళ దర్శకుడు మృతి

ఇటీవల కాలంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచీ కూడా ప్రతి రోజూ లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అలాగే వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా అందులో సామాన్య ప్రజలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు తమిర కరోనాతో మృతిచెందారు. కరోనా తో గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు తమిర. కాగా ఈ రోజు ఉదయం మృతి చెందారు.

కరోనా తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల ఆయన మృతి చెందారని తెలుస్తోంది. తమిర 2010లో కె.బాలచందర్, భారతీరాజా లతో రెట్టసూజి అనే సినిమాను తీసి దర్శకుడిగా మారారు. ఇక తమిర మృతి పట్ల సినీ తమిళ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement