Friday, April 26, 2024

మాజీ మంత్రి మణికంఠన్ కు మరో షాక్ ఇచ్చిన తమిళనటి

తమిళ సినీ నటి చాందిని అన్న డిఎంకె నేత, మాజీ మంత్రి మణికంఠన్ కు మరో షాక్ ఇచ్చారు. 10 కోట్ల రూపాయలు తనకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే మణికంఠన్ తనను నమ్మించి సహజీవనం చేసి మోసం చేశారని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గతంలో చాందిని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే

అయితే మణికంఠన్ ను అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా స్థానిక సైదాపేట కోర్టులో చాందిని మరో కేసు దాఖలు చేశారు. తనకు పది కోట్ల నష్టపరిహారం చెల్లించాలని చెన్నై లో ఉండి కోర్టు వ్యవహారాలను తను చూసుకోవటానికి నెల వారి అయ్యే ఖర్చులను కూడా ఆయనే చెల్లించాలని పిటిషన్ లో కోరారు. ఇక ఈ పిటిషన్ పై ఆగస్టు 5న కోర్టు విచారణ చేపట్టనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement