Sunday, May 5, 2024

మొదలైన ‘శాకుంతలం’.. 2022లో ఆగమనం

సుదీర్ఘ విరామం తర్వాత స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ‘శాకుంతలం’ షూటింగ్ సోమవారమే ప్రారంభమైంది. ఎన్నో అద్భుత‌మైన చిత్రాలు తెర‌కెక్కించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త వినోదాన్ని అందించిన గుణశేఖ‌ర్ ఈ మూవీకి దర్శకుడు. గ‌త రెండు నెల‌లుగా సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతూ వచ్చాయి. శకుంత‌ల‌, దుష్యంతుడిగా సమంత, దేవ్ పాత్ర‌లు పోటాపోటీగా ఉంటాయంటున్నారు మేక‌ర్స్. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్రకు తెలుగు అమ్మాయి ఈషాను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. దిల్ రాజు కూడా ఈ చిత్రంలో భాగం కావ‌డంతో సినిమాని గుణశేఖర్ భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించ‌నున్నాడు. 2022లో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నామ‌ని దిల్ రాజు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement