Friday, April 26, 2024

పోస్టు చేసి డిలీట్ చేసిన ప్రీతం జుకల్కర్..

సమంత స్టైలిస్ట్ ప్రీతం జుకల్కర్ సోషల్ మీడియాలో చేసిన ఓ ఫోస్టు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. “కొంతమంది మగవాళ్ళు తమ నిజ స్వరూపాన్ని ఇళ్లలో దాచేస్తారు. మహిళలపై హింసకు వారే బాధ్యులు. హింస అనేది ఇప్పుడు మానసిక వేధింపులు, విమర్శల రూపంలో ఉంది ఆయన రాశారు. కాని ఈ పోస్టును వెంటనే ఆయన తొలగించారు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కానీ నెటిజన్లు ఇది సమంత, చైతన్య విడాకులపై చేసిన వ్యాఖ్య అని భావిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే అతను అసలు ఆ పోస్ట్ ను ఎందుకు చేశాడు? ఎందుకు డిలీట్ చేశాడు.. ?

సమంతా, నాగచైతన్య విడిపోతున్నట్లు ఈ మధ్యే ప్రకటించిన సంగతి తెలిసిందే. “మా శ్రేయోభిలాషులందరికీ. చాలా చర్చల తర్వాత మా స్వంత మార్గాలు కొనసాగించడానికి చై, నేను భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మేము ఒక దశాబ్దం పాటు స్నేహంగా ఉండటం అదృష్టం. మా మధ్య ఎప్పటికీ ఒక ప్రత్యేక బంధం ఉంటుందని మేము నమ్ముతున్నాము. ఈ క్లిష్ట సమయంలో మాకు సపోర్ట్ చేయాలని, మేము లైఫ్ లో ముందుకు సాగడానికి అవసరమైన గోప్యతను ఇవ్వమని మా అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియాను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ సపోర్ట్ కు ధన్యవాదాలు”… అంటూ పోస్టు చేసింది. ఈ నేపథ్యంలో సామ్ స్టైలిస్ట్ ఒక పోస్ట్ చేయడం, దానిని వెంటనే డిలీట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో రేషన్ కార్డుల లెక్క ఇదీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement