Thursday, April 25, 2024

ఆ అవకాశం పోవడానికి సాయి పల్లవి రెమ్యూనరేషనే కారణమా ?

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానాలు అయ్యప్పన్ కొషియమ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన మొదట సాయి పల్లవిని అని అనుకున్నారు. కానీ ఆఖరి క్షణం లో నిత్యామీనన్ ను తీసుకువచ్చారు. ఇక సాయి పల్లవిని తప్పించడానికి కారణం లేకపోలేదట. ఈ సినిమాలో నటించడానికి సాయి పల్లవి మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. ఆ పాత్ర నిడివి తక్కువగా ఉండటంతో అంత రెమ్యునరేషన్ చాలా ఎక్కువ అని నిర్మాతలు భావించారట. దీంతో ఆమెను పక్కనపెట్టి నిత్యామీనన్ ను తీసుకున్నారట.

నిత్య మీనన్ అతి తక్కువ రెమ్యూనిరేషన్ కి ఆ పాత్ర చేయడానికి ఓకే చేసిందని కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement