Friday, April 19, 2024

తగ్గేది లే..పుదుచ్చేరిలో సీఎం పీఠం కోసం.. ఎన్డీయే కూటమిలో రగడ

పుదుచ్చేరిలో రాజకీయ రగడ మొదలైంది.. ఫలితాలు వెలువడి రెండు రోజులు కూడా కాకముందే ఆరు సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ ముఖ్యమంత్రి పీఠం తమకే కావాలంటూ పట్టుబడుతోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి రంగస్వామి సిద్ధమవుతుండగా, బీజేపీ మెలికపెట్టింది. ముఖ్యమంత్రి పదవి తమకే కావాలని పట్టుబడుతోంది. అయితే, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, తానే ముఖ్యమంత్రినని, అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధమని రంగస్వామి ప్రకటించడంతో బీజేపీ వెనక్కి తగ్గింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు కలిసి కూటమి సభ్యులు కోరారు.

30 మంది సభ్యులున్న పుదుచ్చేరి శాసనసభలో రంగస్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్ 10 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 6, డీఎంకే 6, కాంగ్రెస్ 2, స్వతంత్ర అభ్యర్థులు 6 స్థానాల్లో విజయం సాధించారు. ప్రభుత్వ ఏర్పాటుకు 16 మంది ఎమ్మెల్యేల అవసరం కాగా, ఎన్డీయేదే అధికారమని తేలిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement