Friday, May 17, 2024

రిపబ్లిక్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చెర్రీ

దేవకట్ట దర్శకత్వంలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం రిపబ్లిక్. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. విషింగ్ మై డియర్ బ్రదర్ సాయి ధరమ్ తేజ్… అంటూ చెప్తూనే చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక డైరెక్టర్ దేవకట్ట ప్రస్థానం సినిమా తో స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఆ తర్వాత వచ్చిన ఆటోనగర్ సూర్య ఫ్లాప్ అయింది.

దీంతో కొంత గ్యాప్ తీసుకున్న దేవకట్ట మంచు విష్ణుతో డైనమైట్ సినిమా చేశాడు. ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి లాంగ్ గ్యాప్ తీసుకున్న దేవాకట్ట రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement