Monday, April 29, 2024

కరోనా తో ఆర్జీవి సోదరుడు మృతి

దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ మహమ్మారి బారిన పడి సామాన్య ప్రజలతో పాటు సిని రాజకీయ ప్రముఖులు కూడా మృతి చెందుతున్నారు. తాజాగా ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రముఖ దర్శకుడు ,నిర్మాత పి సోమశేఖర్ మృతి చెందారు. సోమశేఖర్ స్వయానా రామ్ గోపాల్ వర్మ సోదరుడు.

సోమశేఖర్ పలు సినిమాలకు పని చేశారు. రంగీలా, దౌడ్ సత్య కంపెనీ సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వహించారు. ఇక సోమశేఖర్ ఇతర వ్యాపారాల్లోకి కూడా వెళ్లడంతో వర్మ కు దూరంగా ఉన్నారు. ఇదిలా ఉండగా సోమశేఖర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement