Wednesday, May 1, 2024

ఆదిపురుష్ సెట్ లో రావణుడు !!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించబోతున్నాడు. అలాగే సీతగా కృతిసనన్ కనిపించబోతోంది. ఇక సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది.

అయితే తాజాగా షూటింగ్ పై ఓ అప్డేట్ బయటికి వచ్చింది. సైఫ్ అలీ ఖాన్ పై రావణ లంక కోసం వేసిన సెట్ లో ఈ షూటింగ్ జరుగుతుందట. ప్రభాస్ లేని సన్నివేశాలను కొన్ని ఇలా కంప్లీట్ చేసిన తర్వాత ప్రభాస్ పై సన్నివేశాలను షూట్ చేయబోతున్నారట. ఇక వచ్చే ఏడాది ఆగస్టు నాటికి ఈ సినిమా ను రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement