Wednesday, May 1, 2024

విజయ్ తో సినిమాపై రష్మీక ఆసక్తికరమైన వ్యాఖ్యలు

విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాలు.. గీతగోవిందం, డియర్ కామ్రేడ్. ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి ఈ జంట కలిసి నటించబోతున్నట్లు ఇటీవల కాలంలో వార్తలు తెరపైకి వచ్చాయి.

అయితే ఈ వార్తలపై రష్మిక మందన స్పందించింది. సరైన కథ దొరికితే మరోసారి విజయ్ తో కచ్చితంగా నటిస్తానని చెప్పుకొచ్చింది. అయితే ఆ సమయం కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన రష్మిక ఈ విషయాన్ని తెలిపింది. రష్మీక ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement