Saturday, April 20, 2024

నందికొట్కూరులో వైసీపీ,టీడీపీ డిష్యూం డిష్యూం

కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం కోళ్లబాపురంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన పలువురికి గాయాలు అయ్యాయి. వైసీపీ నేత సిద్ధార్థరెడ్డి అనుచరులు దాడి చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే..ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో ఇరువర్గాలను నచ్చచెప్పే ప్రయత్నం చేసిన పోలీసులపై కూడా వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్ పై సిద్ధార్థరెడ్డి అనుచరులు మూకుమ్మడిగా చేయడంతో కానిస్టేబుల్ రఘు అపస్మారస్థితిలోకి వెళ్లాడు. వెంటనే పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement