Wednesday, May 1, 2024

దుబాయ్ లో రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు.. ఘ‌నంగా బేబి ష‌వ‌ర్ వేడుక‌

దుబాయ్ టూర్ లో ఉన్నారు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఆయ‌న భార్య ఉపాస‌న‌.దుబాయ్ లో ఉపాసన కజిన్స్ అండ్ సిస్టర్స్ తో కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ వెకేషన్ లో రకరకాల కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఈ మెగా జంట. దుబాయ్ లో ఉపాసనకి తన సిస్టర్స్ సీమంతం కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఉపాసన కుటుంబ సభ్యులు కూడా అటెండ్ అయ్యారు. దుబయ్ లో జరిగిన ఈ సీమంతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. షేర్ చేయడంతో పాటు ఈ సందర్బంగా తన సిస్టర్స్ కి థాంక్యూ చెప్పింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ప్రగ్నెన్సీ విషయంలో రామ్ చరణ్ మరియు ఉపాసన చాలా ప్లానింగ్ తో ముందుకు వెళ్తారు. ఈరకంగా చాలా మాటలు కూడా పడ్డారు ఇద్దరు. చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు ఇడ్డరిని. ఇద్దరితో పాటు మెగా ఫ్యామిలీపై కూడా సోషల్ మీడియాలో రక రకాల వార్తలు స్ప్రెడ్ చేశారు. అయితే వాటిని ఈ జంట లెక్క చేయలేదు. తమ పని తాము చూసుకుంటూ వెళ్ళిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement