Friday, May 17, 2024

భయంతో జీవించే వ్యక్తిని కాదు…రకుల్

కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో హిట్ ను అందుకుంది. అయితే ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారిన రకుల్ టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలందరితోనూ నటించింది. ప్రస్తుతం మాత్రం రకుల్ కు పెద్దగా సినిమా అవకాశాలు ఏమి లేవు. ఇదిలా ఉండగా సినీ కెరీర్ లో రకుల్ ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడుతూ… ప్రతిదానికి భయపడుతూ జీవించే వ్యక్తిని కాదని…వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే తెలుసని చెప్పుకొచ్చింది.

నేను భయంతో జీవించే వ్యక్తిని కాదు. నేను ఏమీ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. చాలామంది కోరుకునే సినిమాలు చేసే అవకాశం లభించింది. నేను నా కలను నిజం చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు రకుల్. ఇక సినిమాల విషయానికి వస్తే క్రిష్, వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement