Friday, May 17, 2024

వాక్సిన్ తీసుకున్న రజనీకాంత్

కరోనా మహమ్మారి కి చెక్ పెట్టాలంటే వాక్సిన్ తీసుకోవాల్సిందేనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ వాక్సిన్ తీసుకున్నారు. ఇదే విషయాన్ని చెబుతూ సౌందర్య రజినీకాంత్ ట్వీట్ చేశారు. తన తలైవర్ వ్యాక్సిన్ తీసుకున్నవారు. ఇక కలసికట్టుగా పోరాడదాం.. విజయం మనదే. అంతేకాదు తప్పనిసరిగా మాస్క్ దరిద్దాం. ఇంట్లోనే ఉందాం అంటూ ట్వీట్ చేశారు. కాగా కోవీషీల్డ్ సెకండ్ డోస్  ను రజిని తీసుకున్నారు. కొన్ని రోజు క్రితం అన్నాత్తై షూటింగ్ ను హైదరాబాద్ లో పూర్తి చేసుకుని చెన్నై చేరుకున్నారు. ఈ సినిమా షూట్ పూర్తి అయ్యాక రజినీకాంత్ విదేశాలకు వెళ్లి ఆరోగ్యానికి సంబంధించి పరీక్షలు చేయించుకొనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement