Monday, May 6, 2024

రాధేశ్యామ్ సెట్ లో అడుగు పెట్టబోతున్న ప్రభాస్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తి అయినప్పటికీ రీషూట్ కోసం మరో పది రోజులు కేటాయించారు.

కాగా ఫైనల్ షెడ్యూల్ లో ప్రభాస్ ఈ నెల చివరి వారంలో జాయిన్ అవుతున్నాడని సమాచారం. ఈ షెడ్యూల్ తో సినిమా కూడా పూర్తి కాబోతుందట. ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్ లో జరుగుతుందట. అలాగే ఈ సినిమా షూటింగ్ అయిపోగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొనబోతున్నారట. ఆ తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమా షూట్ లో జాయిన్ అవ్వబోతున్నారు ప్రభాస్.

Advertisement

తాజా వార్తలు

Advertisement