Tuesday, April 30, 2024

ప్రభాస్ నుంచి మరో పాన్ ఇండియా మూవీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీని లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే రాధే శ్యామ్, సలార్, ఆది పురుష్, నాగ్ అశ్విన్ సినిమాలతో బిజిబిజీగా గడుపుతున్న ప్రభాస్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నాగ్ అశ్విన్‌ సినిమా తర్వాత మళ్లీ ‘సలార్’ కాంబినేషన్‌లోనే మరో పాన్ ఇండియా మూవీ ఉంటుందట. ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్‌లో ప్రభాస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒప్పందం కూడా అయిపోయిందట.

చాలా కాలం క్రిత‌మే దిల్ రాజు బ్యాన‌ర్‌లో సినిమా చేసేందుకు ప్రభాస్ భారీ అడ్వాన్స్ తీసుకున్నా.. స‌రైన క‌థ‌, ద‌ర్శ‌కుడు దొర‌క్క‌పోవ‌టంతో ఆ ప్రాజెక్టు అలాగే ఉండిపోయింది. ప్ర‌శాంత్ నీల్ ప‌నిత‌నం ప‌ట్ల ఇంప్రెస్ అయిన ప్ర‌భాస్.. మ‌రోసారి ఛాన్స్ ఇచ్చేందుకు ఒప్పుకున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. 2023లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement