Monday, April 29, 2024

మూడోసారి కరోనా బారిన పడ్డ పోసాని కృష్ణమురళి..

టాలీవుడ్ ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి మరోసారి కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ నిమిత్తం పుణె వెళ్లిన ఆయన నిన్న (గురువారం) హైదరాబాద్నట్ తిరిగి వచ్చారు. అయితే ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా కొవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. పోసానికి కోవిడ్-19 సోకడం ఇది మూడోసారి.

దీంతో, కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే ప్రైవేటు ఆస్పత్రి (ఏఐజీ)లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఇంతకు ముందు కూడా రెండు సార్లు పోసాని కోవిడ్-19 బారిన పడినప్పటికీ ఆ తర్వాత కోలుకున్నారు. ఈసారి కూడా ఆయన కోలుకొని త్వరగా సాధారణ స్థితికి వస్తారని ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఆశిస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement