Thursday, May 2, 2024

ప‌వ‌న్..సాయిధ‌ర‌మ్ ల మూవీ టైటిల్ పై అప్ డేట్

ద‌ర్శ‌కుడిగా స‌ముద్ర‌ఖ‌ని తెర‌కెక్కిస్తున్న చిత్రం లో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. మ‌రో ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్‌ స్క్రిప్ట్ సహకారం అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ గురించి చాలా కాలంగా చర్చ నడుస్తుంది. అనేక రకాల పేర్లు తెరపైకి వచ్చాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దేవ‌ర‌..బ్రో అనే టైటిల్స్ ప్రధానంగా వినిపించాయి. ఇందులో దేవర స్టార్ హీరో ఎన్టీఆర్‌30 చిత్రానికి నిర్ణయించారట. ఇక ఇప్పుడు బ్రో అనే పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఈ టైటిల్‌ సస్పెన్స్ కి తెరపడింది. టైటిల్‌ ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ డేట్‌, టైమ్‌ ఫిక్స్ చేశారు. మే18 సాయంత్రం నాలుగు గంటల 14 నిమిషాలకు `పీకేఎస్‌డీటీ సినిమా టైటిల్‌ని, ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా రిలీజ్‌ డేట్‌ని కూడా కన్ఫమ్‌ చేశారు. జులై 28న రాబోతున్నట్టు మరోసారి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement