Saturday, May 4, 2024

షూటింగ్ పూర్తి చేసుకున్న పాన్ఇండియన్ మూవీ‘హను-మాన్‌’

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘విస్మయం’, ‘జాంబీరెడ్డి’ వంటి సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అతని దర్శకత్వంలో వస్తున్న నెక్స్ట్ మూవీ ఓక పాన్-ఇండియన్ సినిమా. కాగా, ‘హను-మాన్‌’ పేరుతో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సూపర్ హీరో మూవీ ఇప్పుడు నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్టు తెలస్తోంది. ‘‘ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావడానికి 130 పని రోజులు పట్టింది. హను-మాన్ షూటింగ్ దేశం అంతటా విస్తృతంగా జరిగింది. ఇక ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అని నిర్మాతలు ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ సజ్జ, అమృత అయ్యర్ మేయిన్ లీడ్ లో నటించగా.. వరలక్ష్మి శరత్‌కుమార్, రాజ్ దీపక్ శెట్టి, వినయ్ రాయ్ కీలక పాత్రల్లో కనిపిచనున్నారు. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో మే 12న రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement