Friday, April 19, 2024

పెరుగుతున్న పెట్రోల్ ధరపై నిఖిల్ ట్వీట్…వైరల్

దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో అయితే ఏకంగా సెంచరీకి మించి ఉంది. ఇదే స్థాయిలో వేర్వేరు రాష్ట్రాల్లో కూడా ధరలు ఉన్నాయి. కాగా ఇదే విషయమై అధికార పార్టీపై ప్రతిపక్షాల విమర్శలు కూడా చేస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పెట్రోల్ ధరల పెంపుపై ఓ పోస్ట్ పెట్టారు.

ప్రస్తుతం నిఖిల్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. చెట్టు పైన ఉన్న పెట్రోల్ పంపుల ఫోటోలను పోస్ట్ చేస్తూ… అసలేం జరుగుతోంది… 35 రూపాయలు ఉండాల్సిన పెట్రోల్, డీజిల్ ధర వంద రూపాయలు దాటింది. ఇంధన ధరలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ట్యాక్స్ లను వెంటనే రద్దు చేయాలి. ఇలా నిత్యం ధరలు పెరిగిపోవడం కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని పేర్కొన్నారు. నిఖిల్ చేసిన ట్వీట్ కు నెటిజన్స్ నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement