Monday, March 25, 2024

కర్నూలు: జీజీహెచ్‌లో శిశువు తారుమారు కలకలం

కర్నూలు జిల్లా జీజీహెచ్‌లో శిశువు తారుమారు కలకలం రేపింది. దేవనకొండ మండలం నెల్లిబండకు చెందిన రజియా అనే మహిళ సోమవారం నాడు మగబిడ్డకు జన్మనిచ్చింది. కాగా పుట్టిన శిశువుకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఎన్‌ఐసీయూలో చికిత్స అందజేశారు. అయితే రాత్రి 8 గంటల ప్రాంతంలో శిశువు చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. పుట్టినప్పటి బిడ్డ, మృత శిశువు వేరు వేరుగా ఉన్నారని.. బిడ్డను తారుమారు చేశారని బాలింత రజియా ఆరోపించారు. ఈ ఘటనపై బాలింత బంధువులు రాత్రి ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.

ఈ వార్త కూడా చదవండి: ఒంగోలులో అర్థరాత్రి ఓ ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి

Advertisement

తాజా వార్తలు

Advertisement