Friday, May 3, 2024

కుల‌దైవానికి.. న‌య‌న‌తార దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు

స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌ దంపతులు తమ కులదైవాన్ని దర్శించుకున్నారు . తంజావూర్ జిల్లా పాపనాశం సమీపంలోని కులదైవం మేలవళత్తూర్ ఆట్రంగరై శ్రీ కాంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా తమ పిల్లల నామకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ పిల్లల శ్రేయస్సు కోసం.. తాము నటించే సినిమాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించారు జంట. అయితే వీరు టూర్లు వేస్తున్నారు కాని..వారి పిల్లలు ఉయిర్, ఉలగ్ లను మాత్రం ఎక్కడా కనిపించనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. కనీసం వారి ఫోటోలు కూడా బయట కనిపించకుండా దాచేస్తున్నారు. ఇప్పటి వరకూ నయన్ తార కవల పిల్లలు ఫోటోలు బయటకు రాలేదు. వారు కూడా తమ ఫ్యాన్స్ కు కాని.. మీడియాకు కాని కనిపించకుండా దాచేస్తున్నారు. ఇక ఈ ఇద్దరు స్టార్లు తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. రాఘవా లారెన్స్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ప్రస్తుతం కమల్ హాసన్ నిర్మాతగా విఘ్నేష్ ఓసినిమాను చేయాల్సి ఉంది. ఈసినిమా ద్వారా దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా పరిచయం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇటు ఫ్యామిలీ లైఫ్ నుఅటు ప్రొఫిషినల్ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తున్నారు జంట.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement