Saturday, April 27, 2024

త్వరలో మణిరత్నం స్ట్రెయిట్ తెలుగు సినిమా

తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం తన పూర్తి దృష్టిని నవరస వెబ్ సిరీస్ పై పెట్టిన సంగతి తెలిసిందే. మనిషిలోని తొమ్మిది భావోద్వేగాలను, తొమ్మిది భాగాలుగా మొత్తం తొమ్మిది మంది దర్శకులకు తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. అయితే ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 6 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ప్రమోషన్ లో భాగంగా మణిరత్నం మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… త్వరలోనే కచ్చితంగా తెలుగులో ఒక స్ట్రెయిట్ సినిమా చేస్తానని చెప్పుకొచ్చారు.

అయితే గతంలో మహేష్ బాబుకి స్క్రిప్ట్ వినిపించిన మాట నిజమేనని… కాని ఆ సమయంలో అది వర్కౌట్ కాలేదని తెలిపారు. ఇద్దరం కలిసి పని చేయాలంటే కథే నిర్ణయించాలని చెప్పుకొచ్చారు మణిరత్నం.

Advertisement

తాజా వార్తలు

Advertisement