Thursday, March 28, 2024

ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు…

ఏపీలో క‌రోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 81,763మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా 2,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా కారణంగా 18మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా మ‌రో 3,034మంది కరోనా నుంచి కొలుకున్నారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 19,26,988కి చేరింది. అలాగే యాక్టివ్ కేసుల సంఖ్య 26,710కి చేరింది. కరోనా నుంచి కొలుకున్నవారి సంఖ్య 18,87,236కి చేరింది. ఇక మొత్తం మరణాల సంఖ్య 13,042కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement