Sunday, April 28, 2024

మ‌ళ్ళీ పెళ్లి ..మే 26న రిలీజ్

మే 26న మ‌ళ్ళీ పెళ్లి మూవీని రిలీజ్ చేయ‌నున్న‌ట్లు సీనియర్ నటులు నరేశ్ త‌న ట్విట్ట‌ర్ లో ప్ర‌క‌టించాడు. కాగా ఈ చిత్రంలో న‌రేశ్.. పవిత్ర లోకేశ్ జంటగా నటిస్తున్నారు. నరేశ్ నిజ జీవిత కథతో ఎంఎస్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నరేష్ నిర్మాతగా వ్యహరిస్తున్న ఈ సినిమాలో నరేశ్ రియల్ లైఫ్, ఆయన గత పెళ్లిళ్ల చుట్టూ తిరుగుతుందని టీజర్ ద్వారా తెలిసింది. ప్రస్తుతం నరేశ్, నటి పవిత్ర లోకేశ్ సహజీవనం చేస్తున్నారని సమాచారం. ఆమెని పెళ్లి కూడా చేసుకోవాలని నరేశ్ భావిస్తున్నప్పటికీ.. తన మూడో భార్య రమ్య రఘుపతితో విడాకుల కేసు ఇంకా తేలకపోవడంతో ముందడుగు వేయలేకపోతున్నారు. ఈ లోపు తన నిజజీవితాన్నే ఆయన తెరపై చూపే ప్రయత్నం చేస్తున్నారు. రమ్యా రఘుపతి పాత్రలో వనిత విజయ్ కుమార్ నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement