Thursday, April 25, 2024

‘మేజర్’ రిలీజ్ వాయిదా

శశికిరణ్ తిక్క దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు ప్రధాన పాత్రలు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మేజర్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే కరోనా కారణంగా చాలా సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంటున్నాయి.

ఈనేపధ్యంలోనే మేజర్ చిత్రం కూడా రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. రిలీజ్ కొత్త డేట్ ను త్వరలోనే తెలియజేస్తాం అని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు, సోని పిక్చర్స్ తో కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement