Thursday, May 2, 2024

సంగీత ప్రపంచంలో ‘ ఖుషి ‘

విజయ్‌ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా మ్యూజిక్‌ కన్సర్ట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమం ఆద్యంతం మ్యూజిక్‌ లవర్స్‌ ను ఆకట్టుకుంది. ఖుషి సినిమాలోని పాటలను గాయకులు జావెద్‌ అలీ, సిధ్‌ శ్రీరామ్‌, మంజూష, చిన్మయి, సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ ఆలపించి ఆకట్టు-కున్నారు. ‘ఖుషి’ -టైటిల్‌ సాంగ్‌ లో విజయ్‌ దేవరకొండ, సమంత లైవ్‌ పర్‌ ఫార్మెన్స్‌ ఇవ్వడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఖుషి’ పాన్‌ ఇండియా స్థాయిలో సెప్టెంబర్‌ 1న విడుదలకు సిద్దమవుతోంది.

ఇక మ్యూజిక్‌ కన్సర్ట్‌ లో సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ మాట్లాడుతూ ఖుషి లో లవ్‌ ఫీల్‌ ఉన్న పాటలు, మ్యూజిక్‌ చేసేందుకు నాకు ఇన్సిపిరేషన్‌ ఇచ్చింది నా డియర్‌ వైఫ్‌ ఐషా. అన్నారు.నిర్మాత నవీన్‌ యెర్నేని మాట్లాడుతూ – మా సంస్థ తరుపున ఇలాంటి బ్యూటిఫుల్‌ మ్యూజిక్‌ కన్సర్ట్‌ చేయలేదు. అన్నారు.నిర్మాత వై రవిశంకర్‌ మాట్లాడుతూ – విజయ్‌, సమంత మా సంస్థలో మరోసారి పనిచేయడం సంతోషంగా ఉంది. అన్నారు.

దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ – ఖుషి సినిమా చూసేందుకు థియేటర్స్‌ కు వెళ్లిన పె్లళన జంటలు, పెళ్లి కాని వారు, పెళ్లి లైఫ్‌ లో చేసుకోవద్దు అనుకునే వారు..అందరూ ఈ సినిమా చూశాక తమ లవ్‌ లైఫ్‌ లోని మెమొరీస్‌ షేర్‌ చేసుకుంటారు. ప్రేమగా హగ్‌ చేసుకుంటారు. అన్నారు.

హీరోయిన్‌ సమంత మాట్లాడుతూ – షూటింగ్‌ -టైమ్‌ లో పాటలు విని ఖుషి ఆల్బమ్‌ లవ్‌ లో పడిపోయాను. ఇక్కడ లైవ్‌ లో పాటలు వింటు-ంటే -టైమ్‌ ను ఫాస్ట్‌ ఫార్వర్డ్‌ చేసి సెప్టెంబర్‌ 1న మీ అందరితో సినిమా చూడాలని అనిపిస్తోంది. అని చెప్పింది.

- Advertisement -

హీరో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ మీరు ప్రపంచంలో ఎక్కడున్నా, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఏ భాషలో మాట్లాడేవారైనా మీ దగ్గరకు ఖుషి పంచేందుకు వచ్చేస్తాం. మేము ప్రమోషన్‌ ఈవెంట్స్‌ చేస్తుంటే చాలామంది వచ్చి సమంత మాకు ఇన్సిపిరేషన్‌ అని చెబుతున్నారు. వాళ్లు ఎదుర్కొంటు-న్న ప్రాబ్లమ్స్‌ షేర్‌ చేసుకుంటు-న్నారు. అని అన్నారు.

ఆనంద్‌ దేవరకొండ, సినిమాటోగ్రాఫర్‌ జి.మురళి, మైత్రీ సీఈవో చెర్రీ , సారేగమా మ్యూజిక్‌ లేబుల్‌ నుంచి విక్రమ్‌ మెహ్రా తదితరులు మాట్లాడారు

Advertisement

తాజా వార్తలు

Advertisement