Tuesday, May 7, 2024

కలెక్షన్స్ తో మోతమోగిస్తున్న ‘కర్ణన్’

ధనుష్ కర్ణన్ సినిమా కరోనా సమయంలో కూడా కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈనెల 9న రిలీజ్ అయిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను సాధిస్తోంది. మారి సెల్వ రాజ్ దర్శకత్వంలో వి. క్రియేషన్స్ బ్యానర్ పై కలై పులి నిర్మిస్తున్న ఈ చిత్రం లో ధనుష్ సరసన రజీషా విజయన్ నటించింది. కాగా అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. కరోనా కారణంగా 50 శాతం సీటింగ్ లోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది.

తొలి రోజు 100% ఆక్యుపెన్సీ తో మొదలైనప్పటికీ ఆ తర్వాత ప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో సగం సీట్లతోనే సినిమాని నడిపించాల్సి వచ్చింది. అయితే విడుదలైన ఐదు రోజుల్లో 40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. కరోనా సమయంలోనే ఇలా ఉంటె ఒక వేళ కరోనా ఆంక్షలు లేకుంటే ఈ చిత్రం కలెక్షన్ల పరంగా మరింత ముందుకు వీల్లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement