Tuesday, May 7, 2024

ఉప్పెన హీరోతో జాతిరత్నాలు దర్శకుడు ?

జాతి రత్నాలు సినిమాతో దర్శకుడు అనుదీప్ ఫేమస్ అయిపోయాడు. మొదటి సినిమా పిట్టగోడ తో అంతగా మెప్పించలేకపోయినప్పటికీ జాతిరత్నాలు సినిమాతో మాత్రం ఇండస్ట్రీని ఆకర్షించాడు. దీంతో దర్శకుడు అనుదీప్ కి భారీ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఉప్పెన సినిమాతో హిట్ అందుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో సినిమా చేసే అవకాశం అనుదీప్ కి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే వైష్ణవ్ తేజ్ క్రేజీ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తాజాగా జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో కూడా సినిమాకి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి అది నిజమో కాదో తెలియాలంటే ఎవరో ఒకరు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement