Monday, May 6, 2024

Janai Bhosle : ఛ‌త్ర‌ప‌తి భార్య‌గా జ‌నై భోంస్లే!

ప్రముఖ గాయని ఆశా భోంస్లే తన మనవరాలు జ‌నై భోంస్లే సినీ రంగంలోకి ఎంట్రీపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆమె తన ‘ఎక్స్‌’ (ట్విట్టర్)లో భారతీయ సినిమాల్లోకి త‌న మ‌న‌వ‌రాలు ప్రవేశిస్తున్నట్లు తెలిపారు.

“ది ప్రైడ్ ఆఫ్ భార‌త్‌-ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ చిత్రంలో నా అంద‌మైన మ‌న‌వ‌రాలు జ‌నై భోంస్లే భాగం కావ‌డంపై చాలా సంతోషిస్తున్నాను. సినీ ప్ర‌పంచంలో జనై కోరుకుంటున్న‌ గమ్యస్థానాన్ని చేరుకుంటుందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఆమెకు, సినిమా తీస్తున్నద‌ర్శ‌కుడు సందీప్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని తన పోస్ట్‌లో రాశారు.

- Advertisement -

శివాజీ భార్య పాత్ర‌లో క‌నిపించ‌నున్న జ‌నై..
ఇక.. ఆశా భోంస్లే పోస్ట్ ప్రకారం ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్ – ఛత్రపతి శివాజీ మహారాజ్’ పేరుతో రాబోయే చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ భార్య రాణి సాయి భోంసాలే పాత్రలో ఆమె మనవరాలు జ‌నై కనిపించనుంది. ఈ చిత్రం ద్వారా సందీప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇమ్మెర్సో స్టూడియో, లెజెండ్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా డిసెంబర్ 19, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో జనైని ఎంపిక చేయడంపై చిత్ర నిర్మాత సందీప్ సింగ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. “ఛత్రపతి శివాజీ మహారాజ్ కుటుంబ వంశానికి చెందిన వారసుడు, చాలా తెలివైన, నిష్ణాతులైన కుటుంబంతో తన వంశాన్ని పంచుకున్న జ‌నైని ప‌రిచ‌యం చేయ‌డం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. దివంగత లతా మంగేష్కర్జీ ఆమె అత్త, ఆశా భోంసలేజీ మనవరాలు. రాణి సాయి బాయి పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేస్తుంది” అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement