Saturday, May 11, 2024

మనుషులుపై సిగ్గు గా ఉంది…రష్మీ ఆవేదన

జబర్దస్త్ షో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ రష్మి గౌతమ్. తన అందంతో అభినయంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు అప్పుడప్పుడు వెండితెర పై కూడా మెరుస్తూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండేది రష్మీ సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. మహిళలపై వేధింపులు జరిగినా జంతువులను ఎవరైనా హింసించిన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా తాజాగా కేరళ ప్రభుత్వం పై రష్మీ మండిపడ్డారు. బ్రూనో అనే కుక్క విషయంలో రష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు విషయం ఏంటంటే తిరువనంతపురంలో ముగ్గురు యువకులు బ్రూనో అనే కుక్కను కట్టేసి క్రికెట్ బ్యాట్ తో అతి క్రూరంగా కొడుతూ చంపేశారు. ఆ కుక్కను గాలానికి వేలాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా దానిని పోస్ట్ చేస్తూ రష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మనుషుల పై సిగ్గుగా అనిపిస్తుంది. అది ఏం పాపం చేసింది. మీకు ఏమి అన్యాయం చేసింది అంటూ తనదైన శైలిలో మండిపడ్డారు రష్మీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement