Friday, May 3, 2024

పరమ చెత్త రికార్డు నమోదు చేసిన శ్రీలంక క్రికెట్ టీమ్

శ్రీలంక క్రికెట్ జట్టు పరమ చెత్త రికార్డు నమోదు చేసింది. వన్డేల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఓడిపోయిన టీమ్‌గా నిలిచింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో శ్రీలంక ఓటమిపాలైంది. దీంతో ఆ దేశం జాబితాలో 428 పరాజయాలు వచ్చి చేరాయి. ఇప్పటిదాకా 858 మ్యాచ్‌లను శ్రీలంక ఆడింది. అందులో 390 విజయాలను నమోదు చేసింది. ఈ జాబితాలో శ్రీలంక తర్వాత టీమిండియా ఉంది.

భారత్ మొత్తంగా ఇప్పటిదాకా 993 మ్యాచ్‌లు ఆడి 427 ఓడిపోయింది. గెలుపు రేటు పరంగా చూస్తే శ్రీలంక కన్నా భారత్ మెరుగైన స్థానంలోనే ఉంది. 54.67 శాతం మ్యాచ్ లను టీమిండియా గెలిస్తే.. కేవలం 47.69 శాతం మ్యాచ్‌లను శ్రీలంక గెలిచింది. ఈ విషయంలో పాకిస్థాన్ 414 ఓటములతో మూడో స్థానంలో ఉంది. ఇటు టీ 20లోనూ అత్యధిక మ్యాచ్‌లు ఓడిపోయిన జట్టుగానూ శ్రీలంకే ఉంది. మొత్తం 70 మ్యాచ్‌లను ఆ టీమ్ చేజార్చుకుంది. ఆ తర్వాత వెస్టిండీస్ 67 మ్యాచ్‌లు, పాకిస్థాన్ 65 మ్యాచ్‌లు ఓడిపోయాయి. ఒకప్పటిలా శ్రీలంక జట్టు ఇప్పుడు పటిష్ఠంగా లేదు. సంగక్కర, జయవర్ధనే, దిల్షాన్ వంటి ఆటగాళ్ల తరం వెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు శ్రీలంక జట్టు ఆట దారుణంగా తయారైంది. కాగా త్వరలోనే ధావన్ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంక జట్టుతో వన్డే సిరీస్ ఆడనుంది.

ఇది కూడా చదవండి: మ్యాచ్‌కు ముందు శృంగారం చేయాలని టీమిండియా క్రికెటర్లకు సలహా

Advertisement

తాజా వార్తలు

Advertisement