Monday, April 29, 2024

డీజే టిల్లు సీక్వెల్ లో మళ్లీ హీరోయిన్ మార్పు.. అనుపమ పరమేశ్వరన్ కూడా అవుట్!

సిధ్ధూ జొన్నలగడ్డ నటించిన “డీజే టిల్లు” టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సిద్ధూ జొన్నలగడ్డ కథ అందించగా, విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. నేహా శెట్టి కథానాయికగా నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. ఈ సీక్వెల్‌కి ‘టిల్లు స్క్వేర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

‘టిల్లు స్క్వేర్’లో మొదట శ్రీలీలను ప్రధాన నటిగా తీసుకున్నారు, కానీ ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆ తరువాత అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారని మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే షూటింగ్ కూడా ఉంటుంద‌ని తెలిపారు. అయితే.. ఇండస్ట్రీ వర్గాల నుండి వస్తున్న తాజా సమాచారం ప్రకారం అనుపమ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కారణాలు స్పష్టంగా తెలియన‌ప్ప‌టికీ అనుపమ తాను ఈ సినిమా చేయ‌బోన‌ని స్ప‌ష్టం చేసిన‌ట్టు టాక్ వినిపిస్తోంది. అనుపమ స్థానంలో కేరళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్‌ని ఖరారు చేసినట్లు సమాచారం.

- Advertisement -

నాగ చైతన్య చిత్రం ‘ప్రేమమ్’ లో మడోన్నా క‌నిపించి సంద‌డి చేసింది. రీమేక్ అండ్ ఒరిజినల్ రెండు వెర్షన్లలో మడోన్నా అదే పాత్రను పోషించారు. గతేడాది నాని నటించిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో మడోన్నా లాయర్‌గా నటించారు. ఇప్పుడు డీజే టిల్లు సీక్వెల్‌లో నటిస్తుందనే వార్త నిజమైతే తెలుగులో మడోన్నాకి ఇది మూడో సినిమా అవుతుంది.

“టిల్లు స్క్వేర్” చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘డీజే టిల్లు’ టైటిల్ సాంగ్‌ను కంపోజ్ చేసిన రామ్ మిరియాల ‘టిల్లు స్క్వేర్’ చిత్రానికి ఫుల్ టైమ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. వచ్చే ఏడాది మార్చిలో టిల్లు స్క్వేర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement