Thursday, April 18, 2024

రేపటితో ముగియనున్న కన్వీనర్‌ కోటా ఎండీఎస్‌ ప్రవేశాల ప్రక్రియ

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: ఎండీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ మేరకు హెల్త్‌ యూనివర్సిటీ ఇవ్వాల (మంగళవారం) స్ట్రే విడత ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్ధులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయింది.

ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను ఈ చివరి విడత కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఈనెల 30న బుధవారం ఉదయం పది గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ https://www.knruhs.telangana.gov.in/ లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement