టాలీవుడ్ ని డ్రగ్స్ కేసులు ఇంకా కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి ఇప్పటికే పలువురు నటీనటులు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మరికొంతమంది డ్రగ్స్ వాడినట్లుగా తేలింది.ఇప్పుడు మరోసారి డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు మరో టాలీవుడ్ నటుడు. ఇటీవల కర్ణాటకలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో విచారణకు రావాలంటూ టాలీవుడ్ నటుడు తనీష్కు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు జరిగే విచారణకు హాజరు కావాలంటూ మొత్తం ఐదుగురికి నోటీసులు ఇవ్వగా అందులో ఓ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త కూడా ఉన్నారు. తనీష్కు నోటీసులు పంపినట్టు బెంగళూరు పోలీసులు ధ్రువీకరించారు. 2017లో అప్పట్లో తెలుగు చిత్రపరిశ్రమను ఊపేసిన డ్రగ్స్ కేసులోనూ తనీష్ సిట్ ఎదుట హాజరయ్యాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement