Monday, April 15, 2024

ఆమెనే ఫిక్స్… ఈసారి ఇంకాస్త గట్టిగా

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. అలాగే తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం హీరోయిన్ గా కియారా అద్వానీని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఈ అమ్మడి పేరు తెరపైకి వచ్చినప్పటికీ… ఈ సారి కాస్త బలంగా వినిపిస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వినయ విధేయ రామ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరి ఈసారి ఈ ఇద్దరి కాంబినేషన్ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement