Thursday, May 2, 2024

రేపటి నుంచి థియేటర్లో దృశ్యం 2…ఎక్కడో తెలుసా ?

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో 2013లో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం దృశ్యం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. దీంతో ఈ సినిమాను తమిళ, తెలుగు భాషలలో రీమేక్ చేశారు. ఇక ఈ ఏడాది దృశ్యం2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కరోనా కారణంగా ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ స్టార్టయింది.

అయితే ఓటిటి లో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ కావడం మోహన్ లాల్ సినిమాలలో ఇదే మొదటిసారి. కాగా గురువారం దృశ్యం2 యు.ఎ.ఇ., ఖతార్, ఒమన్ లోని  థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు మోహన్ లాల్ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement