Tuesday, May 7, 2024

ధనుష్ తిరు మూవీ OTT రిలీజ్ డేట్ ఫిక్స్..

ధ‌నుష్‌, నిత్యామీన‌న్ జంట‌గా న‌టించిన త‌మిళ చిత్రం తిరుచిత్రాంబ‌ళం క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. ఫ్రెండ్‌షిప్, ల‌వ్, ఫ్యామిలీ ఎమోష‌న్స్ తో ద‌ర్శ‌కుడు మిత్ర‌న్ జ‌వ‌హార్ తెర‌కెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద అర‌వై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ధ‌నుష్‌, నిత్యామీన‌న్ కెమిస్ట్రీతో పాటు వారి న‌ట‌న‌కు మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. సింపుల్ ఎమోష‌న్స్‌ను ద‌ర్శ‌కుడు మిత్ర‌న్ అందంగా చూపించిన‌విధానం బాగుందంటూ కామెంట్స్ వినిపించాయి. థియేట‌ర్ల‌లో అద్భుత‌మైన విజ‌యాన్ని అందుకున్న ఈ సినిమా త్వ‌ర‌లో ఓటీటీలో రిలీజ్ కానుంది. సెప్టెంబ‌ర్ 17న నెట్‌ఫ్లిక్స్‌తో స‌న్ నెక్స్ట్‌లో తిరుచిత్రాంబళం స్ట్రీమింగ్ సిద్ధంగా ఉంది. ఆగ‌స్ట్ 18న థియేట‌ర్ల‌లో ఈ సినిమా విడుద‌లైంది. స‌రిగ్గా నెల రోజుల వ్య‌వ‌ధిలోనే ఓటీటీ లో రిలీజ్ కాబోతున్నది. నెట్‌ఫ్లిక్స్‌లో త‌మిళ వెర్ష‌న్ మాత్ర‌మే అందుబాటులో ఉండ‌గా స‌న్‌నెక్స్ట్‌లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు చెబుతున్నారు.

నిత్యామీన‌న్‌తో పాటు రాశీఖ‌న్నా, ప్రియాభ‌వానీశంక‌ర్ హీరోయిన్లుగా న‌టించారు. ధ‌నుష్‌కు తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి మార్కెట్ ఉండ‌టంతో భారీ ధ‌ర‌కు ఓటీటీ సంస్థ‌లు ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను కొనుగులు చేసిన‌ట్లు స‌మాచారం. తెలుగులో తిరు పేరుతో ఈ సినిమా అనువాద‌మైంది. సినిమా మౌత్ టాక్ బాగున్నా స‌రైన ప్ర‌చారం లేని కార‌ణంగా పెద్ద‌గా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌లేక‌పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement