Thursday, May 2, 2024

నా ప్రతిష్టని కించపరుస్తున్నారు.. మ‌ళ్లీ పెళ్లి రిలీజ్ ఆపండి.. ర‌మ్య ర‌ఘుప‌తి

మ‌ళ్లీ పెళ్లి చిత్రం రిలీజ్ విష‌యంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ చిత్రం విడుదలను ఆపాలంటూ సీనియ‌ర్ న‌టుడు నరేశ్ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు. ఆ సినిమాలోని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె.. ఈ మేరకు కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టను కించపరిచేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ ఆమె ఆరోపించారు.సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ రేపు థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. నరేశ్ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టును రమ్య రఘుపతి ఆశ్రయించారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement