Wednesday, May 8, 2024

హీరోయిన్ ఇంట్లోని10 మందికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి విపరీతంగా ఉంది. ఈ మహమ్మారి బారిన సామాన్య ప్రజలతో పాటు సిని రాజకీయ ప్రముఖులు కూడా పడుతున్నారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ ఇంట మొత్తం 10 మంది కుటుంబ సభ్యులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు… డింపుల్ హయాతి. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఆమె ప్రకటించింది.

ఇలాంటి పరిస్థితుల్లో తాను తన వారి వెంట లేకపోవడం బాధగా ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం డింపుల్ హైదరాబాద్ లోనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు. ఆ తర్వాత తమిళనాడులో లాక్ డౌన్ ప్రారంభమైంది. ఇక ఇప్పుడు తెలంగాణా లో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ఈ అమ్మడు నగరంలోనే చిక్కుకుంది. అయితే తమది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం అని వారిలో 10 మందిని ఈ మహమ్మారి చుట్టుముట్టిందని తెలిపింది. ఇందులో వాళ్ళ తాతగారు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి పరిస్థితిని తలుచుకుంటే తీవ్ర ఆవేదన కలుగుతుంది అని చెప్పుకొచ్చింది డింపుల్.

Advertisement

తాజా వార్తలు

Advertisement